Rajahmundry Diaries

Rajahmundry Diaries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajahmundry Diaries, Rajamahendravaram.

ఇవన్నీ జరిగితే నగరంలోని దివాన్‌చెరువు–లాలాచెరువు–కొంతమూరు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుత...
31/05/2026

ఇవన్నీ జరిగితే నగరంలోని దివాన్‌చెరువు–లాలాచెరువు–కొంతమూరు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతాయి.

రాజమహేంద్రవరం నగరంలోని అన్ని రోడ్లను గోదావరి పుష్కరాలు 2027 నాటికి ప్రాధాన్యతల ఆధారంగా విస్తరించాలి.🔴 ప్రాధాన్యత – 1• రా...
27/05/2026

రాజమహేంద్రవరం నగరంలోని అన్ని రోడ్లను గోదావరి పుష్కరాలు 2027 నాటికి ప్రాధాన్యతల ఆధారంగా విస్తరించాలి.

🔴 ప్రాధాన్యత – 1

• రాజానగరం – దివాన్‌చెరువు – కాతేరు NH-16 రోడ్ (2×40 అడుగుల సర్వీస్ రోడ్లతో పాటు) : 200 అడుగులు

• దివాన్‌చెరువు – మోరంపూడి – కడియపులంక రోడ్ NH-216A (2×40 అడుగుల సర్వీస్ రోడ్లతో పాటు) : 200 అడుగులు

• బొబ్బిల్లంక – పి.వి. నరసింహారావు పార్క్ – వేమగిరి గోదావరి నది గట్టు రోడ్ : 120 అడుగులు

• కొవ్వూరు గోదావరి గట్టు రోడ్ (గామన్ బ్రిడ్జ్ నుండి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ వరకు) : 100/120 అడుగులు

• కొవ్వూరు NH-16 బైపాస్ రోడ్ (2×40 అడుగుల సర్వీస్ రోడ్లతో పాటు) : 200 అడుగులు

• రాజానగరం – బూరుగుపూడి – బుచ్చెంపేట – బొబ్బిల్లంక రోడ్ : 80/100 అడుగులు

• బూరుగుపూడి – ఎయిర్‌పోర్ట్ – కొంతమూరు రోడ్ NH-516E : 120/150 అడుగులు

• కొంతమూరు – తాడితోట రోడ్ : 80/100 అడుగులు

• కాతేరు – జిల్లా కోర్టు రోడ్ : 80/100 అడుగులు

• పుణ్యక్షేత్రం – గోదావరి గట్టు / శ్యామల జంక్షన్ రోడ్ : 80 అడుగులు

• హుకుంపేట – తూర్పు రైల్వే స్టేషన్ రోడ్ : 80 అడుగులు

• కేశవరం / సంపత్ నగరం – తూర్పు రైల్వే స్టేషన్ – తాడితోట రోడ్ : 80/100 అడుగులు

• వేమగిరి – రైల్వే స్టేషన్ రోడ్ : 80 అడుగులు

• పట్టిసీమ – కొవ్వూరు గోదావరి గట్టు రోడ్ NH-365BB : 40 అడుగులు

• సీతానగరం – బొబ్బిల్లంక గోదావరి గట్టు రోడ్ : 40 అడుగులు

• కొవ్వూరు NH-16 బైపాస్ బస్ స్టాప్ – గోదావరి మాత విగ్రహం రోడ్ : 100 అడుగులు

🟠 ప్రాధాన్యత – 2

• దివాన్‌చెరువు – శ్రీరాంపురం – పుణ్యక్షేత్రం రోడ్ : 80 అడుగులు

• లాలాచెరువు – క్వారీ మార్కెట్ – మల్లయ్యపేట రోడ్ : 80 అడుగులు

• లాలాచెరువు – వై జంక్షన్ – పుష్కర్ ఘాట్ రోడ్ : 120 అడుగులు

• ఎస్పీ ఆఫీస్ – శ్రీరాంపురం రోడ్ : 80 అడుగులు

• పద్మావతి నగర్ ఫ్లిప్‌కార్ట్ – పిడింగొయ్యి – శ్రీకృష్ణపట్నం రోడ్ : 80 అడుగులు

• వై-జంక్షన్ – జంపేట బ్రిడ్జ్ రోడ్ : 80 అడుగులు

• రామాలయం జంక్షన్ – గోరక్షణపేట రోడ్ : 80 అడుగులు

• కంబాలచెరువు – సీతంపేట – కోటిలింగాల ఘాట్ రోడ్ : 40/80 అడుగులు

• సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ – ఎర్రకొండ క్వారీ కెనాల్ రోడ్ : 80 అడుగులు

• వేమగిరి – చైతన్య నగర్ కెనాల్ రోడ్ : 100 అడుగులు

• వేమగిరి – పొట్టిలంక గోదావరి గట్టు రోడ్ : 40/80 అడుగులు

🟡 ప్రాధాన్యత – 3

• రాజానగరం – వెలుగుబంద – పాలచర్ల – కోలమూరు – కాతేరు రోడ్ : 40/80 అడుగులు

• దోసకాయలపల్లి – దివాన్‌చెరువు రోడ్ : 40/80 అడుగులు

• తొర్రేడు – మధురపూడి రోడ్ : 40 అడుగులు

• రామాలయం జంక్షన్ – ఎస్‌విజి మార్కెట్ రోడ్ (మోరంపూడి–ఆవ వాంబే కాలనీ రోడ్ వరకు) : 60/80 అడుగులు

• శాటిలైట్ సిటీ – బొమ్మూరు రోడ్ : 40/80 అడుగులు

• శాటిలైట్ సిటీ – సంపత్ నగరం రోడ్ : 40/80 అడుగులు

• రాజవోలు – కడియం రోడ్ : 40/80 అడుగులు

🟢 ప్రాధాన్యత – 4

• రాజానగరం – కానవరం రోడ్ : 40/80 అడుగులు

• చక్రద్వారబంధం – కానవరం రోడ్ : 40/80 అడుగులు

• చక్రద్వారబంధం – శ్రీకృష్ణపట్నం రోడ్ : 40/80 అడుగులు

• దివాన్‌చెరువు – నరేంద్రపురం రోడ్ : 40/80 అడుగులు

• దివాన్‌చెరువు – కోలమూరు రోడ్ : 40/80 అడుగులు

• పిడింగొయ్యి – గాదాలమ్మనగర్ రోడ్ : 40/80 అడుగులు

• పిట్లవాని చెరువు – RIET కాలేజ్ రోడ్ : 40/80 అడుగులు

• ఎర్రకొండ – కడియం రైల్వే ట్రాక్ వెంట కొత్త రోడ్ : 2×40 అడుగులు

రాజమహేంద్రవరం నగరంలో 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ ఒక సమగ్ర ప్రణాళికను సిద...
12/05/2026

రాజమహేంద్రవరం నగరంలో 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.

గోదావరి పుష్కరాలు 2027 కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ₹30 కోట్ల విలువైన పనులను ప్రతిపాదించింది. నగర పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వివిధ ప్రాంతాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సుల కోసం అధికారులు నగరంలో 10 ప్రాంతాలను గుర్తించి, అక్కడ తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆ తాత్కాలిక బస్టాండ్లు ఈ క్రింది ప్రాంతాలలో ఏర్పాటు చేయబడనున్నాయి :

1. ఏడీబీ (ADB) రోడ్డు జంక్షన్
2. దివాన్‌చెరువు జీరో పాయింట్
3. కొంతమూరు
4. రాముడి చెరువు
5. కొవ్వూరు-1 (టోల్ గేట్ వద్ద)
6. కొవ్వూరు-2 (టోల్ గేట్ వద్ద)
7. మార్గాని ఎస్టేట్స్
8. ప్రధాన రైల్వే స్టేషన్ – తూర్పు వైపు
9. ఏఎంజీ (AMG) స్కూల్ గ్రౌండ్స్
10. ధవళేశ్వరం – డెక్కన్ క్రానికల్ ఏరియా

రాజమండ్రి నగరానికి రెండో అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ అవసరం ఉంది. 🚏🚌 రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ ₹350 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉంది, ✈️ ₹270 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఇప్పుడు బస్ స్టాండ్‌ను అభివృద్ధి చేసే సమయం వచ్చింది.

⏳రాజమండ్రి బస్ స్టాండ్ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది, 🧑‍🤝‍🧑 అయితే ఇది నగర అవసరాలను తీర్చడం లేదు. దీనివల్ల చుట్టుపక్కల రహదారులు భారీగా రద్దీగా మారాయి. 🚗🚕🚙ప్రస్తుత బస్ స్టాండ్ ఉన్న ప్రదేశం కారణంగా బస్సులు ఇరుకైన రోడ్లలో ప్రయాణించక తప్పదు, దీని వల్ల తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడడం మరియు ప్రమాదాలు పెరగడం జరుగుతోంది.

🚧🚨ప్రస్తుతం బస్సులు రోడ్–కమ్–రైల్వే బ్రిడ్జ్ 🌉 లేదా సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ పై ప్రయాణించేందుకు అనుమతి లేదు. గతంలో, అమరావతి మరియు ఖమ్మం వైపు నుండి కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్తున్న బస్సులు కొవ్వూరు వద్ద రోడ్–కమ్–రైల్వే బ్రిడ్జ్ దాటి, కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద నగరంలోకి ప్రవేశించి, తాడితోట మీదుగా నేరుగా బస్ స్టాండ్‌కి చేరుకునేవి. ➡️ఇప్పుడు RCR బ్రిడ్జ్‌పై ప్రయాణాన్ని నిషేదించడంతో, ఈ బస్సులు కొవ్వూరు నుండి గమ్మన్ బ్రిడ్జ్ మీదుగా కాతేరు వద్ద రాజమండ్రి నగరంలోకి ప్రవేశించి, అక్కడి నుండి మల్లయ్యపేట, పేపర్ మిల్, కాంబలచెరువు మీదుగా బస్ స్టాండ్‌కి చేరుతున్నాయి. 🔄 ఆ తరువాత అవి కాంబలచెరువు, రామాలయం జంక్షన్ లేదా మోరంపూడి జంక్షన్ మీదుగా లాలాచెరువు వెళ్లి, రాజానగరం వద్ద నగరాన్ని విడిచి వెళ్తున్నాయి. 🗺️ దీని వలన ప్రధాన రహదారులన్నీ తీవ్ర రద్దీతో నిండిపోతున్నాయి.

😩రావులపాలెం మరియు ద్వారపూడి వైపు నుండి వచ్చే బస్సులు వేమగిరి వద్ద నగరంలోకి ప్రవేశించి, ధవళేశ్వరం, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్ స్టాండ్ మీదుగా ప్రస్తుత బస్ స్టాండ్‌కు చేరుతున్నాయి. 🛤️ వేమగిరి నుండి బస్ స్టాండ్ దాకా మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 💥 అదనంగా, ఇసుక లారీలు మరియు పేపర్ మిల్ వాహనాలు ట్రాఫిక్ భారాన్ని మరింత పెంచుతున్నాయి.

🚚🏭కొత్త బస్ స్టాండ్‌ను దివాన్ చెరువు–లాలాచెరువు–కొంతమూరు ప్రాంతంలో నిర్మిస్తే, తాడితోట, లూథర్గిరి, మల్లయ్యపేట, నందంగనీ రాజు జంక్షన్, ILTD జంక్షన్, ధవళేశ్వరం వంటి రద్దీ ప్రాంతాలపై ఉన్న ట్రాఫిక్ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. 📉ఈ ప్రదేశం రాజానగరం, బూరుగుపూడి, కాతేరు, కడియం, వేమగిరి వంటి నగర శివారు ప్రాంతాలు సమదూరంలో ఉంటుంది. 📍 రాష్ట్ర ప్రభుత్వం వెలుగుబండ, కానవరం, బూరుగుపూడి, తొర్రేడు ప్రాంతాల్లో 50,000కు పైగా గృహస్థలాలను కేటాయించడం వల్ల నగర ఈశాన్య భాగంలో జనాభా వేగంగా పెరుగుతోంది మరియు నగరం ఆ దిశగా వేగంగా విస్తరిస్తోంది. 🏘️🏘️🏘️ ఈ ప్రాంతంలో రహదారులను 200 అడుగుల వరకు విస్తరించవచ్చు. 🛣️ 4-లేన్ Gammon బ్రిడ్జ్‌కు ప్రత్యక్ష అనుసంధానం ఉండటం వల్ల NH-16కి సులభంగా కలుస్తుంది. 🔗 లాలాచెరువు, దివాన్ చెరువు జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రణాళికలో ఉండటం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశం అంతగా ఉండడు. 🏗️ ఈ ప్రాంతం ఎత్తైన ప్రదేశం కావడంతో వర్షాకాలంలో రహదారులు మునిగే ప్రమాదం కూడా చాలా తక్కువ.

🏞️కొత్త బస్ స్టాండ్ పూర్తి అయ్యేలోపు కొన్ని కీలక మౌలిక వసతుల అభివృద్ధి అవసరం. రాజానగరం–దివాన్ చెరువు–కాతేరు NH-16 మార్గం, అలాగే దివాన్ చెరువు–మోరంపూడి–కడియపులంక NH-216A మార్గాలలో 2 X 40 ft wide service road మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. 💡 కొత్త బస్ స్టాండ్‌కు అనుసంధానమయ్యే మాస్టర్ ప్లాన్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలి, తద్వారా నగరంలోని అన్ని భాగాలనుండి సులభ రాకపోకలు సాధ్యమవుతాయి.

🔄రాజమండ్రి భవిష్యత్తులో పర్యాటక రాకపోకల్లో భారీ పెరుగుదల చూడనుంది. 🤩 చారిత్రాత్మక హావెలాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణం, జూలాజికల్ పార్క్ స్థాపనతో పాటు పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి చేరువలో ఉండటం వల్ల వేలాదిమంది పర్యాటకులు, విద్యార్థులు, పరిశోధకులు నగరానికి వచ్చే అవకాశం ఉంది. 🏞️🧑‍🎓🔬 ఈ పర్యాటక రద్దీ పాత బస్ స్టాండ్ పరిసర రహదారులపై మరింత ఒత్తిడి పెడుతుంది. 😥 వెడల్పైన రహదారులతో చేరుకునే కొత్త బస్ స్టాండ్ లేకపోతే పర్యాటక బస్సులు, వ్యక్తిగత వాహనాలు మరియు షటిల్ సర్వీసులు రద్దీ రహదారుల్లోకి ప్రవేశించి ట్రాఫిక్ ఆలస్యం, భద్రతా ప్రమాదాలు, కాలుష్యం వంటి సమస్యలు పెరుగుతాయి. దివాన్ చెరువు–లాలాచెరువు–కొంతమూరు ప్రాంతంలో ప్రతిపాదిత కొత్త బస్ స్టాండ్ NH-16కు నేరుగా అనుసంధానం కలిగి ఉండటం వల్ల భారీ వాహనాలు, పర్యాటక ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రణ చేయవచ్చు. 🚦

వీటితో పాటు నగరంలో శాశ్వత ప్రాతిపదికన సిటీ బస్సులు నడపాలి.

08/05/2026

Rajahmundry New Airport Terminal Current Status 🥰

విశాఖపట్నం-రాజమహేంద్రవరం NH-16ను ₹10,230 కోట్ల వ్యయంతో విస్తరించేందుకు ప్రతిపాదించబడింది. విశాఖపట్నం-రాజమహేంద్రవరం 6 లేన...
01/05/2026

విశాఖపట్నం-రాజమహేంద్రవరం NH-16ను ₹10,230 కోట్ల వ్యయంతో విస్తరించేందుకు ప్రతిపాదించబడింది. విశాఖపట్నం-రాజమహేంద్రవరం 6 లేన్ల NH-16 ప్రాజెక్ట్ ప్రతిపాదనను అలైన్‌మెంట్ క్లియరెన్స్ కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు పంపారు. ఆమోదం లభించిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ సాంకేతిక మరియు ఆర్థిక మంజూరు దశలకు వెళ్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఐదు 36 కి.మీ పొడవైన గ్రీన్ ఫీల్డ్ బైపాస్ రోడ్లు అనకాపల్లి-కశింకోట, నక్కపల్లి, తుని పట్టణం, యర్రవరం, జగ్గంపేట వద్ద రానున్నాయి. రాజమండ్రి నగరంలో NH-16 బైపాస్ రోడ్డు అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులో రాజమండ్రి నగరానికి రాజానగరం నుండి దేవరపల్లి వరకు బైపాస్ రోడ్డును ప్రతిపాదించాలి.

వైజాగ్–రాజమండ్రి NH-16 మార్గాన్ని 6 లైన్లకు అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన హర్షణీయమైనదే అయినప్పటికీ, రాజమండ్రి నగర పరిమితులలో ప్రతిపాదించిన ప్రణాళికలో దీర్ఘకాలిక మరియు సమగ్ర దృష్టికోణం లోపిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం NH-16 రహదారి రాజమండ్రి నగరం గుండా 22 కిలోమీటర్ల పొడవునా రాజానగరం → దివాన్ చెరువు → కాతేరు → 4 కి.మీ గామన్ వంతెన → కొవ్వూరు మార్గంలో వెళుతోంది. ముఖ్యంగా, విశాఖపట్నం–రాజమహేంద్రవరం విభాగమే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా 4 లైన్లుగానే ఉన్న ఏకైక NH-16 భాగం కాగా, రాష్ట్రంలోని ఇతర అన్ని భాగాలు ఇప్పటికే 6 లైన్లకు అభివృద్ధి చేయబడ్డాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన దాని ప్రకారం, నగర పరిధిలో కేవలం రాజానగరం–దివాన్ చెరువు విభాగానికే విస్తరణ ప్రణాళిక చేయబడింది.

ఇది దివాన్ చెరువు–కొవ్వూరు విభాగంపై తీవ్రమైన ఆందోళనలకు దారితీస్తోంది. కాతేరు–కొవ్వూరు మధ్య ఉన్న 4-లైన్ గామన్ బ్రిడ్జ్‌ను 6 లైన్లకు విస్తరించడం సాధ్యం కాదు. దీంతో, మొత్తం 6-లైన్ జాతీయ రహదారిలో ఇది శాశ్వతమైన బాటిల్‌నెక్‌గా మారుతోంది. రాజమహేంద్రవరంలో రాజానగరం నుండి దివాన్ చెరువు, కొంతమూరు మీదుగా కొవ్వూరు వరకు, నగర ట్రాఫిక్ మరియు NH-16, NH-216A, NH-516E, NH-365BG, ADB రోడ్డు నుండి వచ్చే ట్రాఫిక్ కలవడం వల్ల రద్దీ ఏర్పడుతుంది. అదేవిధంగా, రాజానగరం–దివాన్ చెరువు–కాతేరు కారిడార్ వెంబడి ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న నివాస, వాణిజ్య మరియు విద్యా కేంద్రాలుగా ఉన్నాయి మరియు నగరంలోని ప్రధాన కేంద్ర ప్రాంతాలుగా రూపాంతరం చెందుతున్నాయి.

ఇంకా, కానవరం, వెలుగుబంద, తొర్రేడు, బూరుగుపూడి వంటి సమీప ప్రాంతాల్లో ఇప్పటికే 50,000కు పైగా గృహ స్థలాలు కేటాయించబడ్డాయి. దీనివల్ల జన సంద్రత పెరిగి, ట్రాఫిక్ భారం ప్రస్తుతం ఉన్నా NH-16 రహదారి పై పడుతుంది.

గోదావరి పుష్కరాలు 2027 దృష్ట్యా రాజమండ్రి నగరానికి అవుటర్ రింగ్ రోడ్ (ORR) ప్రతిపాదించబడినప్పటికీ, కొత్త గోదావరి నది వంతెన లేకుండా NH-16 మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను అది సమర్థవంతంగా మళ్లించలేదు. అదనంగా, రోడ్-కమ్-రైల్వే బ్రిడ్జి (RCR బ్రిడ్జి) మరో సుమారు 10 సంవత్సరాల పాటు మాత్రమే సేవలందించే సామర్థ్యం ఉందని అంచనా. ప్రజా భద్రత కారణంగా, ఇప్పటికే RTC బస్సులు, ప్రైవేట్ బస్సులు మరియు భారీ వాహనాలు RCR బ్రిడ్జిపై పరిమితం చేయబడ్డాయి. దీంతో భారీ వాహనాల ట్రాఫిక్ గామన్ వంతెన మీదుగా వెళ్తున్నాయి. RCR బ్రిడ్జి మరియు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మధ్య మరో కొత్త వంతెన నిర్మించడం సాంకేతికంగా సాధ్యం కాదు. భవిష్యత్తులో RCR బ్రిడ్జి మూసివేయబడితే, గామన్ బ్రిడ్జిపై తీవ్రమైన భారం పడటంతో ట్రాఫిక్ సమస్యలు మరియు భద్రతా ప్రమాదాలు మరింత పెరిగే అవకాశముంది. అంతేకాకుండా, నగర పరిధిలో జాతీయ రహదారులపై తరచుగా జరుగుతున్న ప్రమాదాలు బైపాస్ అవసరాన్ని మరింత స్పష్టంగా సూచిస్తున్నాయి.

ఈ అన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని, కోల్‌కతా–చెన్నై NH-16 కారిడార్‌లో భాగంగా, విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6 లైన్ల ప్రాజెక్టులో రాజమండ్రి నగరానికి ప్రత్యేకమైన 6 లైన్ల NH-16 బైపాస్ అత్యవసరం. దీనితో పాటు గోదావరి నదిపై కొత్తగా 6/8 లైన్ల వంతెన నిర్మించడం కూడా అవసరం. ఈ నగర బైపాస్‌కు క్రింది మార్గాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు:

రాజానగరం → బూరుగుపూడి → బుచ్చెంపేట → మిర్తిపాడు → బొబ్బిల్లంక → కొత్త గోదావరి వంతెన → దేవరపల్లి

ఈ బైపాస్ రోడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు :

1. కోల్‌కతా–చెన్నై NH-16, రాజమహేంద్రవరం–ఖమ్మం NH-365BG, రాజమహేంద్రవరం–విజయనగరం ఏజెన్సీ హైవే NH-516E, రాజమండ్రి–కాకినాడ పోర్ట్ ADB రోడ్ ట్రాఫిక్ నగరానికి బయటకు మళ్లించబడుతుంది

2. కోల్‌కతా–చెన్నై మధ్య నిరంతర 6 లేన్ కనెక్టివిటీ

3. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా మూసివేసినప్పుడు గామన్ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్ రద్దీ మరియు భారం నివారిస్తుంది

4. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది

5. రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది

రాజమండ్రి నగరానికి NH-16 బైపాస్ రోడ్డును విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6 లైన్ల NH-16 DPRలో సమగ్రంగా చేర్చాలని, నగర పరిమితుల్లో ఎంపిక చేసిన భాగాల విస్తరణకే పరిమితం కాకుండా నగర అవసరాలకు అనుగుణమైన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని వినయపూర్వకంగా కోరుతున్నాము.

రాజమండ్రి-వైజాగ్ 3వ, 4వ రైల్వే లైన్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదంహౌరా-చెన్నై హై డెన్సిటీ నెట్‌వర్క్ కింద రాజమహేంద్రవరం మరి...
19/04/2026

రాజమండ్రి-వైజాగ్ 3వ, 4వ రైల్వే లైన్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

హౌరా-చెన్నై హై డెన్సిటీ నెట్‌వర్క్ కింద రాజమహేంద్రవరం మరియు విశాఖపట్నం మధ్య 3వ మరియు 4వ రైల్వే లైన్లను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

• దువ్వాడ మరియు నిడదవోలు రైల్వే స్టేషన్ల మధ్య 198 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్లను నిర్మించనున్నారు.
• రాజమండ్రి నగరం వద్ద గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన వంతెనను ప్రతిపాదించారు.
• రాజమండ్రి నగరంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మరియు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీల మధ్య గోదావరి నదిపై కొత్త వంతెన వచ్చే అవకాశం ఉంది.
• మొత్తం ప్రాజెక్ట్ వ్యయం: ₹9,889 కోట్లు.

**లోపాలు/ఆందోళనలు**

• అలైన్‌మెంట్‌పై స్పష్టత లేకపోవడం: ఈ లైన్లు రాజమండ్రి రైల్వే స్టేషన్ గుండా వెళతాయా లేదా బైపాస్ చేస్తాయా అనే విషయంలో స్పష్టత లేదు.

**అవసరమైన సవరణలు/సూచనలు**

• ప్రతిపాదిత గోదావరి వంతెన అద్భుతమైన (Iconic) నిర్మాణ శైలిని కలిగి ఉండాలి.
• వంతెన కనీసం రెండు రైల్వే లైన్లను కలిగి ఉండాలి.
• కొత్త లైన్లు ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్‌ను బైపాస్ చేస్తే, ప్రస్తుత స్టేషన్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేయడానికి బదులుగా, 4 లైన్లు ఉండే చోట ఒక పెద్ద కొత్త స్టేషన్‌ను నిర్మించాలి.
• కొత్త లైన్లు ప్రస్తుతం ఉన్న స్టేషన్ గుండా వెళితే, 7 మరియు 8 ప్లాట్‌ఫారమ్‌లను తప్పనిసరిగా నిర్మించాలి.

ఈ ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నాము.. కానీ...రాజమహేంద్రవరం నగరానికి అవుటర్ రింగ్ రోడ్ (ORR) ఎందుకు అవసరం?1. నగరం ఈశాన్య దిశగ...
17/04/2026

ఈ ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నాము.. కానీ...

రాజమహేంద్రవరం నగరానికి అవుటర్ రింగ్ రోడ్ (ORR) ఎందుకు అవసరం?

1. నగరం ఈశాన్య దిశగా విస్తరణ: నగరం వేగంగా ఈశాన్య దిశలో విస్తరిస్తోంది. ఈ విస్తరణకు అనుగుణంగా ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక అవసరం.

2. ట్రాఫిక్ మళ్లింపు: కోల్‌కతా–చెన్నై (NH-16), రాజమండ్రి–రావులపాలెం–గుండుగొలను (NH-216A), రాజమండ్రి–విజయనగరం ఏజెన్సీ హైవే (NH-516E), రాజమండ్రి–ఖమ్మం–సూర్యాపేట (NH-365BG), రాజమండ్రి–కాకినాడ ADB రోడ్డు మరియు ఇతర జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా వచ్చే భారీ వాహనాలను నగరంలోకి రానీయకుండా బయటి నుంచే మళ్లించాలి.

3. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు: తొర్రేడు, బూరుగుపూడి, వెలుగుబంద, పల్లకడియం, కానవరం, శాటిలైట్ సిటీ, వేమగిరి వంటి శివారు ప్రాంతాల్లో భారీ స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుల వల్ల ట్రాఫిక్ గణనీయంగా పెరుగునుంది. ఈ పెరుగుదలను నగరం తట్టుకునేలా ముందస్తు ప్రణాళిక అవసరం.

4. విమానాశ్రయ అనుసంధానం: సమీప పట్టణాలు, నగరాల నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు మెరుగైన రహదారి అనుసంధానం అవసరం.

5. భవిష్యత్ అభివృద్ధి: హావెలాక్ బ్రిడ్జ్ పర్యాటక అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, జూ పార్క్, కాకినాడ SEZ పోర్ట్, రాబోయే పరిశ్రమల పార్కుల నేపథ్యంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించి నిర్వహించాల్సిన అవసరం ఉంది.

రాజమహేంద్రవరం అవుటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన స్వాగతార్హమైనది. అయితే, అవుటర్ రింగ్ రోడ్‌ను విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6-లేన్ NH-16 ప్రాజెక్టుతో సమన్వయం చేసి అమలు చేస్తే, నగర ప్రజలకే కాకుండా జాతీయ రహదారి వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

రాజమహేంద్రవరం అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించవచ్చు : రాజమహేంద్రవరం సిటీ నార్త్ బైపాస్ + రాజమహేంద్రవరం సిటీ ఈస్ట్ బైపాస్.

1. రాజమహేంద్రవరం సిటీ నార్త్ బైపాస్ : రాజానగరం → ఎయిర్‌పోర్ట్ → బుచ్చెంపేట → మిర్తిపాడు → బొబ్బిల్లంక → కొత్త గోదావరి వంతెన → దేవరపల్లి

ఈ మార్గం ద్వారా ప్రస్తుతం నగరం గుండా వెళ్లే కోల్‌కతా–చెన్నై NH-16 ట్రాఫిక్‌ను నగరం వెలుపల నుంచే మళ్లించవచ్చు. ఇందుకోసం గోదావరి నదిపై కొత్త వంతెన నిర్మాణం అవసరం. అయితే, ఇంతటి భారీ ప్రాజెక్టును RUDA లేదా రాష్ట్ర ప్రభుత్వం భరించడం కష్టం.

ప్రస్తుతం NH-16 రాజానగరం–దివాన్‌చెరువు–కాతేరు మార్గంగా నగరంలో గుండా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం–రాజమహేంద్రవరం విభాగం మాత్రమే ఇంకా 4-లేన్‌గా ఉంది; మిగతా భాగం 6-లేన్‌గా విస్తరించబడింది. విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6-లేన్ NH-16 ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం నగర పరిధిలోని రాజానగరం–దివాన్‌చెరువు విభాగాన్ని మాత్రమే 6-లేన్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల దివాన్‌చెరువు–కొవ్వూరు విభాగంపై తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 4-లేన్ గామన్ బ్రిడ్జ్ (కాతేరు–కొవ్వూరు)ను 6-లేన్‌గా విస్తరించడం సాధ్యం కాదు. దీంతో ఈ విభాగం మొత్తం NH-16 మార్గంలో శాశ్వత బాటిల్‌నెక్‌గా మారుతుంది.

ప్రస్తుతం ఉన్న రాజానగరం–దివాన్‌చెరువు–కాతేరు NH-16 కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే ప్రధాన నివాస, వాణిజ్య, విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. తొర్రేడు, బూరుగుపూడి, వెలుగుబంద, పల్లకడియం, కానవరం ప్రాంతాల్లో 50,000 కంటే ఎక్కువ గృహ స్థలాలు కేటాయించబడ్డాయి. జనాభా వేగంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నా NH-16 మార్గంపై ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. ఈ మార్గంలో Zoo Parkను కూడా ప్రతిపాదించారు.

గోదావరి మీద కొత్త వంతెన లేకుండా NH-16 ట్రాఫిక్‌ను ORR వైపు మళ్లించడం సాధ్యం కాదు. విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6-లేన్ NH-16 ప్రాజెక్టులో నగర బైపాస్ లేకుండా కేవలం రహదారి విస్తరణ మాత్రమే చేస్తే, నగర ప్రజలు సర్వీస్ రోడ్లను మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది, ఎందుకంటే కొత్త హైవేలకు పరిమిత ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి.

RCR (రోడ్-కమ్-రైల్వే) వంతెన మరో 10 సంవత్సరాలు మాత్రమే పనిచేయగలదని అంచనా. భద్రతా సమస్యల కారణంగా RTC బస్సులు, ప్రైవేట్ బస్సులు మరియు భారీ వాహనాలను ఇప్పటికే రోడ్-కమ్-రైల్వే వంతెనపైకి అనుమతించడం లేదు. దీని ఫలితంగా గామన్ వంతెనపై ట్రాఫిక్ భారం పెరిగింది.

RCR వంతెన మూసివేయబడితే, గామన్ వంతెన అధిక భారాన్ని ఎదుర్కొంటుంది. ఇది తీవ్రమైన రద్దీకి దారితీస్తుంది మరియు ప్రమాదాల అవకాశాన్ని పెంచుతుంది. నగరంలో NH-16 పై జరుగుతున్న తరచూ ప్రమాదాలు ప్రత్యేక నగర బైపాస్ అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

కాబట్టి, కోల్‌కతా–చెన్నై NH-16 కారిడార్‌లో భాగంగా, విశాఖ–రాజమహేంద్రవరం 6-లేనింగ్ ప్రాజెక్టులో ప్రత్యేక 6-లేన్ నగర బైపాస్‌తో పాటు గోదావరి నదిపై 6 లేదా 8-లేన్ కొత్త వంతెన నిర్మాణం అత్యవసరం.

సూచించిన NH-16 బైపాస్ లేదా ORR ఉత్తర మార్గం : రాజానగరం → ఎయిర్‌పోర్ట్ → బుచ్చెంపేట → మిర్తిపాడు → బొబ్బిల్లంక → కొత్త గోదావరి వంతెన → దేవరపల్లి.

ఈ మార్గం ప్రయోజనాలు:

1. కోల్‌కతా–చెన్నై NH-16, రాజమహేంద్రవరం–సూర్యాపేట NH-365BG, రాజమహేంద్రవరం–కాకినాడ పోర్ట్ ADB రోడ్ ట్రాఫిక్‌ను రాజమహేంద్రవరం నగరం మరియు కొవ్వూరు పట్టణం నుండి పూర్తిగా మళ్లించవచ్చు.
2. సుస్థిర మరియు ప్రణాళికాబద్ధ నగర అభివృద్ధికి సహకారం అందుతుంది.
3. RCR వంతెన మూసివేసినా గామన్ వంతెనపై అధిక భారం పడకుండా నివారించవచ్చు.
4. కోల్‌కతా–చెన్నై మధ్య నిరంతర 6-లేన్ అనుసంధానం సాధ్యం అవుతుంది.
5. కాకినాడ నగరం మరియు అనేక ప్రాంతాల నుండి ఎయిర్‌పోటీ ప్రయాణం సులభతరం.

అందువల్ల, విశాఖపట్నం (అనకాపల్లి) నుండి రాజమహేంద్రవరం (రాజానగరం) వరకు NH-16 6-లేన్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలి. రాజానగరం నుండి దేవరపల్లి వరకు NH-16 సిటీ బైపాస్‌ను ORRతో సమన్వయం చేసి NHAI లేదా MoRTH ద్వారా అమలు చేయాలి. దీని వల్ల RUDA లేదా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదు.

2. రాజమహేంద్రవరం సిటీ ఈస్ట్ బైపాస్ : రాజానగరం → పల్లకడియం → శ్రీకృష్ణపట్నం → పుణ్యక్షేత్రం → సంపత్‌నగరం → కడియం → కడియపులంక.

ఈ తూర్పు బైపాస్ వల్ల కలిగే ఉపయోగాలు :
1) దీని ద్వార మండపేట, అనపర్తి, రామచంద్రపురం, యానం, రావులపాలెం, అమలాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం నుండి రాజమండ్రి విమానాశ్రయానికి సులభంగా చేరుకోవచ్చు.
2) భారీ వాహనాలు నగరంలోని ప్రస్తుతం ఉన్న దివాన్ చెరువు-కడియపులంక రాహదారి పై రాకుండా నగర శివారుల నుండి వెళ్లిపోతాయి.

ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో పాటు నగరానికి ఇవి చేయాలి :
1) నగరంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల స్థాపన కోసం ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో భారీగా భూసేకరణ చేయాలి (కలవచర్ల, గాదరాడ, తూర్పు గోనగూడెం, మురారి, రామస్వామిపేట, వడిసలేరు, రంగంపేట, పల్లకడియం, కానవరం, ముకుందవరం, ఎలకొలను, రాధేయపాలెం, తోకాడ, పాతా తుంగపాడు, చైతన్య నగర్). ఔటర్ రింగ్ రోడ్ పూర్తయితే ఈ ప్రాంతంలో భారీగా భూమి రేటు పెరుగుతాయి. అప్పుడూ భూసేకరణ చేయటం కష్టం.
2) గోదావరి పుష్కరాలు 2027 నాటికి నగరంలోని రాజానగరం-దివాన్ చెరువు-కాతేరు NH-16 (18 కి.మీ), దివాన్ చెరువు-మోరంపూడి-కడియపులంక NH-216A (22 కి.మీ) రహదారులను 2 × 40 అడుగుల వెడల్పు గల సర్వీస్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, రహదారి భద్రతా చర్యలతో అభివృద్ధి చేయాలి.
3) RTO వద్ద నిలిచిన ట్రంపెట్ ఫ్లైఓవర్ డిజైన్ సవరించి, ప్రారంభమైన దివాన్ చెరువు ఫ్లైఓవర్ పనులు మరియు మంజూరయ్యిన లాలాచెరువు, ITC, వేమగిరి ఫ్లైఓవర్ల పనులు వేగంగా జరగాలి. వీటితో పాటు నరేంద్రపురం, బొమ్మూరు, కడియపులంక కూడళ్ల వద్ద కూడా ఫ్లైఓవర్లు అవసరం.
4) రైల్వే స్టేషన్‌లో 7, 8 ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిపాదించాలి. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు త్వరగా జరగాలి.
5) నూతన విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని త్వరగా అందుబాతులోకి తీసుకురావాలి.
6) దివాన్ చెరువు-లాలా చెరువు-కొంతమూరు మధ్య నగరానికి రెండో ఆధునిక బస్టాండ్ నిర్మించాలి.
7) పుష్కరాల నాటికి పుణ్యక్షేత్రం-శ్యామల సెంటర్, షెల్టన్ హోటల్-బొమ్మూరు-సంపత్ నగరం వంటి అనేక మాస్టర్ ప్లాన్ రహదార్లను విస్తరించాలి.

Rajahmundry city may have 4 MLA seats in the next general elections.Central Government has given green signal for the de...
15/04/2026

Rajahmundry city may have 4 MLA seats in the next general elections.

Central Government has given green signal for the delimitation of Lok Sabha and Legislative Assembly constituencies. At present, the city has Urban, Rajanagaram, and Rural Assembly constituencies. After delimitation, Rajahmundry city may have four MLA seats, namely Rajahmundry North, Rajahmundry East, Rajahmundry West, and Rajahmundry South.

వైజాగ్–రాజమండ్రి NH-16 త్వరలో ఆరు వరుసల రహదారిగా విస్తరణ 🚧🛣️🚀విశాఖపట్నం-రాజమహేంద్రవరం NH-16ను ₹10,230 కోట్ల వ్యయంతో విస్...
06/04/2026

వైజాగ్–రాజమండ్రి NH-16 త్వరలో ఆరు వరుసల రహదారిగా విస్తరణ 🚧🛣️🚀

విశాఖపట్నం-రాజమహేంద్రవరం NH-16ను ₹10,230 కోట్ల వ్యయంతో విస్తరించేందుకు ప్రతిపాదించబడింది. విశాఖపట్నం-రాజమహేంద్రవరం 6 లేన్ల NH-16 ప్రాజెక్ట్ ప్రతిపాదనను అలైన్‌మెంట్ క్లియరెన్స్ కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు పంపారు. ఆమోదం లభించిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ సాంకేతిక మరియు ఆర్థిక మంజూరు దశలకు వెళ్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఐదు 36 కి.మీ పొడవైన గ్రీన్ ఫీల్డ్ బైపాస్ రోడ్లు అనకాపల్లి-కశింకోట, నక్కపల్లి, తుని పట్టణం, యర్రవరం, జగ్గంపేట వద్ద రానున్నాయి. రాజమండ్రి నగరంలో NH-16 బైపాస్ రోడ్డు అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులో రాజమండ్రి నగరానికి రాజానగరం నుండి దేవరపల్లి వరకు బైపాస్ రోడ్డును ప్రతిపాదించవలసిందిగా రాజమండ్రి నగర ప్రజాప్రతినిధులను కోరుతున్నాము.

వైజాగ్–రాజమండ్రి NH-16 మార్గాన్ని 6 లైన్లకు అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన హర్షణీయమైనదే అయినప్పటికీ, రాజమండ్రి నగర పరిమితులలో ప్రతిపాదించిన ప్రణాళికలో దీర్ఘకాలిక మరియు సమగ్ర దృష్టికోణం లోపిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం NH-16 రహదారి రాజమండ్రి నగరం గుండా 22 కిలోమీటర్ల పొడవునా రాజానగరం → దివాన్ చెరువు → కాతేరు → 4 కి.మీ గామన్ వంతెన → కొవ్వూరు మార్గంలో వెళుతోంది. ముఖ్యంగా, విశాఖపట్నం–రాజమహేంద్రవరం విభాగమే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా 4 లైన్లుగానే ఉన్న ఏకైక NH-16 భాగం కాగా, రాష్ట్రంలోని ఇతర అన్ని భాగాలు ఇప్పటికే 6 లైన్లకు అభివృద్ధి చేయబడ్డాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన దాని ప్రకారం, నగర పరిధిలో కేవలం రాజానగరం–దివాన్ చెరువు విభాగానికే విస్తరణ ప్రణాళిక చేయబడింది.

ఇది దివాన్ చెరువు–కొవ్వూరు విభాగంపై తీవ్రమైన ఆందోళనలకు దారితీస్తోంది. కాతేరు–కొవ్వూరు మధ్య ఉన్న 4-లైన్ గామన్ బ్రిడ్జ్‌ను 6 లైన్లకు విస్తరించడం సాధ్యం కాదు. దీంతో, మొత్తం 6-లైన్ జాతీయ రహదారిలో ఇది శాశ్వతమైన బాటిల్‌నెక్‌గా మారుతోంది. అదేవిధంగా, రాజానగరం–దివాన్ చెరువు–కాతేరు కారిడార్ వెంబడి ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న నివాస, వాణిజ్య మరియు విద్యా కేంద్రాలుగా ఉన్నాయి మరియు రానున్న రోజుల్లో నగరంలోని ప్రధాన కేంద్ర ప్రాంతాలుగా రూపాంతరం చెందనున్నాయి.

ఇంకా, కానవరం, వెలుగుబంద, తొర్రేడు, బూరుగుపూడి వంటి సమీప ప్రాంతాల్లో ఇప్పటికే 50,000కు పైగా గృహ స్థలాలు కేటాయించబడ్డాయి. దీనివల్ల జన సంద్రత పెరిగి, ట్రాఫిక్ భారం ప్రస్తుతం ఉన్నా NH-16 రహదారి పై పడుతుంది.

గోదావరి పుష్కరాలు 2027 దృష్ట్యా రాజమండ్రి నగరానికి అవుటర్ రింగ్ రోడ్ (ORR) ప్రతిపాదించబడినప్పటికీ, కొత్త గోదావరి నది వంతెన లేకుండా NH-16 మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను అది సమర్థవంతంగా మళ్లించలేదు. అదనంగా, రోడ్-కమ్-రైల్వే బ్రిడ్జి (RCR బ్రిడ్జి) మరో సుమారు 10 సంవత్సరాల పాటు మాత్రమే సేవలందించే సామర్థ్యం ఉందని అంచనా. ప్రజా భద్రత మరియు నిర్మాణ బలంపై ఉన్న ఆందోళనల కారణంగా, ఇప్పటికే RTC బస్సులు, ప్రైవేట్ బస్సులు మరియు భారీ వాహనాలు RCR బ్రిడ్జిపై పరిమితం చేయబడ్డాయి. దీంతో భారీ వాహనాల ట్రాఫిక్ గామన్ వంతెన మీదుగా వెళ్తున్నాయి. RCR బ్రిడ్జి మరియు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మధ్య మరో కొత్త వంతెన నిర్మించడం సాంకేతికంగా సాధ్యం కాదు. భవిష్యత్తులో RCR బ్రిడ్జి మూసివేయబడితే, గామన్ బ్రిడ్జిపై తీవ్రమైన భారం పడటంతో ట్రాఫిక్ సమస్యలు మరియు భద్రతా ప్రమాదాలు మరింత పెరిగే అవకాశముంది. అంతేకాకుండా, నగర పరిధిలో జాతీయ రహదారులపై తరచుగా జరుగుతున్న ప్రమాదాలు బైపాస్ అవసరాన్ని మరింత స్పష్టంగా సూచిస్తున్నాయి.

ఈ అన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని, కోల్‌కతా–చెన్నై NH-16 కారిడార్‌లో భాగంగా, విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6 లైన్ల ప్రాజెక్టులో రాజమండ్రి నగరానికి ప్రత్యేకమైన 6 లైన్ల NH-16 బైపాస్ అత్యవసరం. దీనితో పాటు గోదావరి నదిపై కొత్తగా 6/8 లైన్ల వంతెన నిర్మించడం కూడా అవసరం. ఈ నగర బైపాస్‌కు క్రింది మార్గాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు:

రాజానగరం → బూరుగుపూడి → బుచ్చెంపేట → మిర్తిపాడు → బొబ్బిల్లంక → కొత్త గోదావరి వంతెన → దేవరపల్లి

ఈ బైపాస్ రోడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు :

1. కోల్‌కతా–చెన్నై NH-16, రాజమహేంద్రవరం–ఖమ్మం NH-365BG, రాజమహేంద్రవరం–విజయనగరం ఏజెన్సీ హైవే NH-516E, రాజమండ్రి–కాకినాడ పోర్ట్ ADB రోడ్ ట్రాఫిక్ నగరానికి బయటకు మళ్లించబడుతుంది

2. కోల్‌కతా–చెన్నై మధ్య నిరంతర 6 లేన్ కనెక్టివిటీ

3. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా మూసివేసినప్పుడు గామన్ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్ రద్దీ మరియు భారం నివారిస్తుంది

4. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది

5. రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది

రాజమండ్రి నగరానికి NH-16 బైపాస్ రోడ్డును విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6 లైన్ల NH-16 DPRలో సమగ్రంగా చేర్చాలని, నగర పరిమితుల్లో ఎంపిక చేసిన భాగాల విస్తరణకే పరిమితం కాకుండా నగర అవసరాలకు అనుగుణమైన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని వినయపూర్వకంగా కోరుతున్నాము.

రాజమహేంద్రవరం నగరంలోని అత్యంత ప్రధానమైన రాజానగరం-దివాన్ చెరువు-కాతేరు NH-16 (18 కి.మీ), దివాన్ చెరువు-మోరంపూడి-కడియపులంక...
29/03/2026

రాజమహేంద్రవరం నగరంలోని అత్యంత ప్రధానమైన రాజానగరం-దివాన్ చెరువు-కాతేరు NH-16 (18 కి.మీ), దివాన్ చెరువు-మోరంపూడి-కడియపులంక NH-216A (22 కి.మీ) రహదారులను ఈ విధంగా అభివృద్ధి చేయాలి 👇👇 :

రాజానగరం-దివాన్ చెరువు-కాతేరు NH-16 (18 కి.మీ), దివాన్ చెరువు-మోరంపూడి-కడియపులంక NH-216A (22 కి.మీ) రహదారులను 2 × 40 అడుగుల వెడల్పు గల సర్వీస్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, రహదారి భద్రతా చర్యలతో పాటు RTO (NH-16 × ADB రోడ్), నరేంద్రపురం, దివాన్ చెరువు, లాలాచెరువు + AV అప్పారావు రోడ్, ITC, మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి, కడియపులంక జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లతో అభివృద్ధి చేయాలి (కొన్ని ఫ్లైఓవర్లు ఇప్పటికే మంజూరయ్యాయి).

గోదావరి పుష్కరాలు 2027 నాటికి ఇది జరుగుతుందని ఆశిస్తున్నాము.

Address

Rajamahendravaram
533106

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajahmundry Diaries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share